ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ఇంట పెళ్లి బాజాలు మోగడం తెలిసిందే. ఖుష్బూ కుమార్తె అవంతిక సుందర్కు శ్రావణ్ శ్రీనివాసన్తో వివాహం జరిగింది. ఈ సంతోషకరమైన వార్తను పంచుకుంటూ ఖుష్బూ ఇన్స్టాగ్రామ్లో ఒక సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆనందంతో తమ కళ్లు చెమర్చాయని, ఇది తమ జీవితంలో మర్చిపోలేని మధుర క్షణమని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. "ఈ సమయంలో ఆనందంతో మాకు మాటలు రావడం లేదు. తల్లిదండ్రులుగా, కుటుంబమే మాకు సర్వస్వం. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని మేము నమ్ముతాం.