HMTV Live
Television
HMTV is an Indian 24-hour Telugu news channel launched on 12 February 2009. The channel is operated by Hyderabad Media Pvt. Ltd, which also runs the English newspaper The Hans India. HMTV is a part of Kapil Group, promoted by K. Vaman Rao.[4][5][6] Kapil Group is a business conglomerate of over 30 companies whose first company, Kapil Chit Funds was started in 1981. The current CEO of the channel is Mrs. Lakshmi Rao. Source
Actions
Media Outlet details
| Scope | Local |
|---|---|
| Language | English, Telugu |
| Country | India |
|
Similarweb UVM |
Request pricing |
|
Comscore UVM |
Request pricing |
| Frequency | Daily |
| Days Published | Mon, Tue, Wed, Thu, Fri, Sat, Sun |
| Broadcast Affiliation | N/A |
Recent Articles
Search ArticlesSircilla: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయండి రైతులకు కలెక్టర్ పిలుపు!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల, మిషన్ భగీరథ, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఎంపీడీఓలతో జరిగిన సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు పూర్తిస్థాయిలో లేవని, ప్రస్తుతం ఉన్న నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాలకే వినియోగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Amaravati:ఏపీలో కొత్త కోవిడ్ వేరియంట్ ‘ఒమిక్రాన్ RF.5’ గుర్తింపు!
Amaravati: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసుల్లో కొత్తగా 'ఒమిక్రాన్ RF.5' ఉప-వేరియంట్ను గుర్తించారు. ఆందోళన అవసరం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సూచించారు.
Rayachoti: స్వయంగా అమ్మవారి పల్లకి మోసిన మంత్రి మండిపల్లి!
రాయచోటి: విరూపాక్షమ్మ తల్లి జాతర మహోత్సవాల చివరి రోజు నిర్వహించిన అంగరంగ వైభవమైన పల్లకి ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి , వారి సతీమణి హరితమ్మ , కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి భక్తిశ్రద్ధలతో అమ్మవారి పల్లకిని స్వయంగా మోసి తన భక్తిని చాటుకున్నారు. జాతరలో పాల్గొన్న భక్తుల మధ్య అమ్మవారి పల్లకి ఊరేగింపు అత్యంత వైభవంగా సాగి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది.
Sircilla: జలాశయాల నీటి నిల్వలపై కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జలాశయాల నీటి నిల్వలపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్.. మధ్యమానేరు, ఎగువ మానేరు, అన్నపూర్ణ రిజర్వాయర్ల ప్రస్తుత నీటి నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సారెస్పీ ఫ్లడ్ ఫ్లో కెనాల్, మూలవాగు, మానేరు వాగు వరద జలాలతో పాటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ ద్వారా మధ్యమానేరు జలాశయాన్ని నింపుతున్నట్లు అధికారులు వివరించారు.
Anantapur: కుటుంబ కలహాలతో వీధి వ్యాపారి బాబావాలిపై కత్తితో దాడి!
Anantapur: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం పరిధిలోని కేవీఎస్ కాలనీలో కుటుంబ కలహాల కారణంగా బాబావాలి అనే వీధి వ్యాపారిపై బంధువులు కత్తితో దాడి చేశారు. Anantapur: కుటుంబ కలహాలతో వీధి వ్యాపారి బాబావాలిపై కత్తితో దాడి! అనంతపూర్: కుటుంబ కలహాలతో అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం పరిధిలో బాబావాలి అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. బుక్కరాయసముద్రంలోని కె వి ఎస్ కాలనీలో బాబావాలి వీధి వీధి తిరుగుతూ వ్యాపారం చేసేవాడు. సమీప బంధువులతో మాట మాట పెరిగి ఒకరికొకరు గొడవపడ్డారు.
Markapuram: రాచర్ల కేజీబీవీలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తనిఖీ!
మార్కాపురం: స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి రాచర్ల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యాబోధన, విద్యార్థినులకు కల్పిస్తున్న వసతి,భోజన సౌకర్యాలు, పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, భోజనం నాణ్యత, పరిమాణం, మెనూ అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు మెనూ ప్రకారం పాయసం అందించాల్సి ఉన్నప్పటికీ విద్యార్థినులకు అందించకపోవడంపై ప్రిన్సిపాల్ను వివరణ కోరారు.
Medchal: లోక్ అదాలత్ ద్వారా ఉచిత, వేగవంతమైన న్యాయం జడ్జి బాల భాస్కర్!
Medchal: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్లో 51 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. Medchal: లోక్ అదాలత్ ద్వారా ఉచిత, వేగవంతమైన న్యాయం జడ్జి బాల భాస్కర్! మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్లో మొత్తం 51 కేసులను పరిష్కరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి.
Tirupati: ఓటీపీలు, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి పోలీసుల హెచ్చరిక!
తిరుపతి: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ప్రజా భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాలు, విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాల్లో బాల్య వివాహాల నిర్మూలన, మైనర్ల డ్రైవింగ్, సైబర్ నేరాలు, ఫేక్ OTP మోసాలు, మహిళల భద్రత, శక్తి యాప్, డయల్-112 సేవల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే గంజాయి, ర్యాగింగ్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, జూదం వంటి సామాజిక దుష్ప్రవర్తనలకు దూరంగా ఉండాలని సూచించారు.
Kurnool: బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం!
కర్నూలు: జిల్లాలోని 18 సంవత్సరాలలోపు పిల్లల సంరక్షణకు కృషి చేస్తామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీమతి, పి. విజయ తెలిపారు. కలెక్టర్ వారి కార్యాలయంలోని శనివారం జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ -1098 కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాలబాలికలకు రక్షణ మరియు సంరక్షించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ -1098 టోల్ ఫ్రీ నెంబర్, 24/7 గం,, లు ఉచితంగా పని చేస్తుందన్నారు.
Kurnool: కల్లూరులో రూ.137.50 కోట్ల నీటి ప్రాజెక్టుకు భూమి పూజ!
Kurnool: మారుతి మెగాసిటీ పార్కులో రూ.137.50 కోట్ల నిధులతో అమృత్ 2 పథకం కింద తాగునీటి పైపులైన్ పనులకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి భూమి పూజ చేశారు.