India దేశ అత్యున్నత న్యాయస్ధానమైన సుప్రీంకోర్టు (Supreme Court) లో ఇవాళ ఓ సంచలన ఘటన చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు విచారణకు హాజరైన ఓ పిటిషనర్ కోర్టు హాల్లో తన ప్రవర్తనతో కలకలం సృష్టించాడు. ఏకంగా న్యాయమూర్తులు కూర్చునే బెంచ్ పైకి పేపర్లు విసరడమే కాకుండా, ఛీఫ్ జస్టిస్ పైనే తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీంతో కోర్టు గదిలో ఉద్రిక్త పరిస్దితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వెంటనే జోక్యం చేసుకున్న న్యాయమూర్తి పోలీసుల సాయంతో అతన్ని బయటికి పంపారు.